అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఖిల్లా ఘనపూర్ మండలంలోని సురాపల్లీ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి గారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి. సాయి చరణ్ రెడ్డి గారు శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ప్రజల అభిమానం మరియు సమాజ సేవ పట్ల తమ బాధ్యతగా భావించిన టి. సాయి చరణ్ రెడ్డి గారు తన సొంత ఖర్చుతో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని స్పాన్సర్ చేయడం విశేషం. ఆయన ఈ కార్యక్రమంలో పూలమాల వేసి, డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.

అదేవిధంగా, అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఖిల్లా ఘనపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.