
తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వెళ్తున్న సందర్భంగా వారిని మన్ననూర్ లోని ఫరెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద మర్యాద పూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికిన అనంతరం నల్లమల అటవీ అభివృద్ధి మరియు నల్లమల అడవుల్లో ఉన్న దేవాలయాలను అబివృద్ధి చేయాలని కోరుతూ.
నల్లమల అడవి మీదుగా అతి త్వరలో నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ వే ను తొందరగా ఏర్పాటు చేయాలని అలాగే మద్దిమడుగు వద్ద ఉన్న కృష్ణనది మీదుగా నిర్మించబోయే బ్రిడ్జి ను రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి అతి త్వరలో ప్రారంభించాలని మంత్రి గారినీ కోరడం జరిగింది.