మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన కేశ యాదయ్య అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, నాయకులు శేఖరా చారి, సయ్యద్ అహమద్, శ్యామ్ సుందర్ గౌడ్, అంజిరెడ్డి, జంగయ్య, ఖాసీం, నర్సిహ్మ, మల్లేష్, లక్ష్మయ్య, లింగం, రాములు పాల్గొన్నారు.