ఊర్కొండ: మండలంలోని బొమ్మరాజు పల్లి పరిధిలోని బూర్గువాని కుంట తండాకు చెందిన వడ్త్యవత్ గన్యా నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లచ్చిరామ్ నాయక్, లంబాడా సంఘం నాయకులు పుణ్యానాయక్, స్వామి నాయక్, నాను నాయక్, విజేందర్ నాయక్,శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.