మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన మోగిలి పెద్ద జంగయ్య సార్ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో మృతుడి భార్య జంగమ్మ, కుమారులు ప్రభాకర్, ప్రవీణ్ నాయకులు టైగర్ జంగయ్య, రుక్మా రెడ్డి, ఇద్దయ్య, కుర్వ సత్తయ్య, కృష్ణా రెడ్డి, బాలస్వామి, మురళి, బొందయ్య, చెన్నయ్య, భాస్కర్, జగన్, వెంకటస్వామి, శ్రీను తదితరులు ఉన్నారు.