ఊర్కొండ: మండలంలోని జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన బరకాని చెన్నమ్మ గత వారం మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి, షేకరాచారి, అహ్మద్, దేవరాజ్, శ్యామ్ సుందర్ గౌడ్, ఆర్.రాజు, బైకని శ్రీశైలం, అజ్మదొద్ధిన్, చెన్నయ్య, కుమార్, జాహని తదితరులు ఉన్నారు.