మృతురాలి కుటుంబానికి ద్యాప నిఖిల్ రెడ్డి గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని గుడిగానిపల్లి గ్రామానికి చెందిన ఎరసాయని మణెమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రజిత కృష్ణయ్య, నాయకులు జంగయ్య, రుక్మారెడ్డి, సత్యనారాయణ, ఇద్దయ్య, తిరుపతయ్య, యాదయ్య, కురువ సత్తయ్య, జంగయ్య, చిన్నయ్య, సుల్తాన్, మల్లేష్, మాధవ్ తదితరులు ఉన్నారు.