మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని రెడ్యా తండా కు చెందిన జర్పులావత్ సీతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ నాయకులు వెంకటేష్ నాయక్, విష్ణు, శేఖర్, శ్రీధర్, శోభన్ బాబు, జగపతి రాజ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు