రాష్ట్రవ్యాప్త రైతు పండగ

ఈనెల 30వ తేదీన ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త రైతు పండగ ఉత్సవాల సందర్బంగా గురువారం ఏర్పాటుచేసిన రైతు సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు , రాష్ట్ర ఇన్చార్జి మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ గారు , జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఉమ్మడి పాలమూరు శాసనసభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సదస్సులో పలు కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ల ద్వారా అన్నదాతలకు, మహిళా సంఘం సభ్యులకు, నిరుద్యోగ యువతకు, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయాలనుకునే వారికి తగిన ప్రోత్సాహకం అందిస్తారని ఆసక్తి గలవారు స్టాల్స్ ను సందర్శించి వారి వారి వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించడం జరిగింది.

కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులు, వివిధ కంపెనీల యాజమాన్యం, బ్యాంకుల అధికారులు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు