కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మణిగిళ్ల మాజీ MPTC, 100 మంది కార్యకర్తలు,నాయకులు

పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామం గ్రామ మేరెడ్డి తిరుపతిరెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ MPTC సభ్యులు నరసింహారెడ్డితో పాటు BRS పార్టీ కి చెందిన 100 మంది కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు

వీరికి నంది హిల్స్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని రానున్న MP ఎన్నికలలో డాక్టర్ మల్లురవి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మద్దిలేటి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాండ్ల రాములు, వెంకటయ్య, నరసింహారెడ్డి, వడ్డే వెంకటేష్, బాలపీరు బోడి కృష్ణయ్య, రాములు, తిరుపతయ్య రాఘవేందర్ రవీందర్ లతోపాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.