నిస్సహాయులైన, అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించాలన్న ముఖ్యఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించామని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని 14 వార్డు బ్రహ్మంగారి వీధిలోఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలని ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు వనపర్తి జిల్లాలోని 255 గ్రామపంచాయతీలలో, ఐదు మున్సిపాలిటీలు 79 వార్డులలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి ఆరో తేదీ వరకు పనిదినాలలో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలతో పాటు ఆహార భద్రతా కార్డు/రేషన్ కార్డుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి, విద్యుత్ శాఖ డి.నరేంద్ర కుమార్, కౌన్సిలర్లు బ్రహ్మ చారి, చీర్ల చందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.