పీర్లగుట్ట దర్గాను దర్శించుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

వనపర్తి జిల్లా పీర్లగుట్ట దర్గా లో గొల్ల వెంకటయ్య యాదవ్ మొహర్రం సందర్బంగా కందూరు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు పాల్గొన్నారు.(పీర్లను) దర్శించుకుని అస్సయ్ దులో అంటూ ప్రత్యేక ప్రార్థనలు చెయ్యడం జరిగింది.

మొహరం (పీర్ల) పండుగ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గారు వేడుకున్నారు.