పెద్దమందడి మండలం ముందరితండా గ్రామం లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామానికి బతుకమ్మ ఆడుతూ ఆటపాటలతో బాణసంచా పేలుస్తుంది ఘనంగా స్వాతం పలకడం జరిగింది.
అలాగే నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు పోలీస్ బృందం వారు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను వలయాధికారి (సీఐ) రాంబాబు పెద్దమందడి, ఖిల్లా ఘణపురం ఎస్సై లతో కలిసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటినుంచి తనతో పాటు రాజకీయంగా ప్రయాణం చేసి తాను ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు పూర్తి స్థాయిలో సహకరించిన ముందరి తండా గ్రామం అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు రాయితీ సిలిండర్లు ఉచిత విద్యుత్ తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ గ్రామ మాజీ సర్పంచ్ జయంతి శంకర్, చీకరు చెట్టు తండా గ్రామ మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, మాజీ జెడ్పిటిసి సభ్యులు కొమ్ము వెంకటస్వామి రమేష్ గౌడ్, మణిగిళ్ల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
