మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని బాల్య లోక్య తండా కు చెందిన కేతావత్ లచ్య నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/-
అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు K. హనుమంతు, M. రవి, కేతావత్ లక్ష్మణ్, M. లక్ష్మణ్, కేతావత్ భూపాల్, తిరుపతి, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.