52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక మరియు ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన

ఈనెల 21, 22, 23 తేదీలలో వనపర్తి జిల్లా సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్ వారు నిర్వహించిన 52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక మరియు ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ

52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలకు సార్ధకత చేకూరేల, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకరించాలని అప్పుడే వాటికి సార్ధకత లభిస్తుందని

వనపర్తి నియోజకవర్గం విద్యాభివృద్ధి కోసం, వైద్యభివృద్ధి కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి 550 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు విజ్ఞాపనలు సమర్పించి ఉన్నామని ఇందులో కేవలం 160 కోట్లు వనపర్తి లో ముఖ్యమంత్రి గారు చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కేటాయించామని

ప్రస్తుతం విద్యాభివృద్ధి కోసం వనపర్తి నియోజకవర్గానికి ఎడ్యుకేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హబ్ మంజూర అయిందని దీంతో వనపర్తి నియోజకవర్గంలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించబోతున్నామని.

అలాగే 25 ఎకరాలలో స్పోర్ట్స్ స్కూల్ నిర్మించేందుకు సైతం అనుమతులు మంజూరయ్యాయని తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కేవలం రెండు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు కాగా అందులో వనపర్తి ఒకటి అవ్వడం గమనార్కమణి.

తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వం అందించే అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నత మార్గాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించడం జరిగింది

ఈ సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా దిశా కమిటీ సభ్యులు శంకర్ నాయక్, జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, మండలాల విద్యాధికారులు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు