3రోజులుగా Canal కాలువల పరిశీలన చేపట్టిన ఎమ్మెల్యే మేఘారెడ్డ
గత మూడు రోజులుగా కల్వకుర్తి ఎత్తిపోతల ప్రధాన కాలువలపై పర్యటిస్తూ, పంట కాలువలు, రెగ్యులేటర్లను కాలువల పటిష్టతను పరిశీలించడం జరిగింది..
గోపాల్పేట మండలంలోని జాకీర్ధర్ కాలువ,గుడిపల్లి రిజర్వాయర్ D8, D5 ప్రధాన కాలువలతో పాటు,బుద్ధారం కుడి ఎడమ కాలువల పరిశీలన, పెద్దమందడి, ఖిల్లా ఘనపురం, మామిడమాడ నేరుడు చెరువు, మున్ననూర్, తిరుమలాపూర్, చందాపూర్, ఖాన్ చెరువు, కాలువలను పరిశీలించడం జరిగింది..
ఈ సందర్భంగా ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడుతూ… 15 రోజుల వరకు రైతులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని అధికారులు నిరాటంకంగా నీటిని విడుదల చేయాలని వారిని ఆదేశించారు
కాలువల వెంట ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిధుల మంజూరి గురించి ఆలోచించకుండా పనులు చేయాలని నిధుల గురించి తను చూసుకుంటానని ఎమ్మెల్యే అధికారులకు భరోసా కల్పించారు.
రైతులు ఎవ్వరు కూడా అధైర్య పడకూడదని నియోజకవర్గ పరిధిలోని ప్రతి చెరువుకు నీరందించేందుకు తాను వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే రైతులకు సూచించారు.