మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి నాగయ్య అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ నాయకులు కొండపల్లి కొండల్, కోటేశ్వర్, సాయికుమార్, లక్షయ్య తదితరులు పాల్గొన్నారు