మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన బోయ మాధవి అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ యువ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు మల్లేష్, కాంగ్రెస్ నాయకులు మధురెడ్డి, ప్రకాష్, నవీన్, కృష్ణ, శివారెడ్డి, వసీం, వంశీ రెడ్డి, అంజియాదవ్, జంషీద్, సాయి కృష్ణ, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు.