ఊర్కొండ: మండలంలోని జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఎలుగొండ రాంరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలుగొండ సుధాకర్ రెడ్డి, గ్రామ ఉపాధ్యక్షుడు సయ్యద్ హైమద్, రాంరెడ్డి, అంజిరెడ్డి, జంగయ్య గౌడ్, అజహర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.