గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన 35 మంది యువకులు వంశీకృష్ణ, సమక్షంలో లోకా రెడ్డి, చంద్రయ్య గార్ల ఆధ్వర్యంలో BRS నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి కాంగ్రెస్ పార్టీ ఖండాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గత పదేళ్ల BRS పాలనలో యువతకు ఎక్కడ న్యాయం జరగలేదని యువకులు హమాలీ పని చేసుకుని జీవించాల్సిన కర్మ పట్టిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువకులకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తుందని దాంతో పార్టీ పథకాలకు ఆకర్షితులమై నేడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
చేరిన ప్రతి ఒక్క యువకుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో పనిచేయాలని ప్రతి ఒక్కరిని తాను గుండెల్లో పెట్టి చూసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ వారికి ఎల్లవేళలా అండగా ఉంటుందని వారికి చెప్పడం జరిగింది