మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన తేర్మటి జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, షేకరా చారి, అహమద్, శ్యామసుందర్ గౌడ్, దేవరాజ్, రాంరెడ్డి, ఖాసీం, మల్లేష్, రవీందర్ రెడ్డి, ఎల్లయ్య, అంజిరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.