ఊర్కొండ: మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన జక్క రాణి అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ T. రజిత కృష్ణయ్య, నాయకులు ద్యాప శేఖర్ రెడ్డి, బాదం శంకరయ్య, జక్క శ్రీనివాస్ రెడ్డి, మేడిపల్లి సుధాకర్ రెడ్డి, కృష్ణా రెడ్డి, గోపాల్ తదితరులు ఉన్నారు.