ఊర్కొండ: మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన ఇంజమూరి మైసమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో INTUC మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సేవదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, నాయకులు అంజయ్య గౌడ్, కానుగుల మల్లేష్, ఏకుల కృష్ణయ్య, చిల్వేర్ జంగయ్య, గోరటి చందు, మాడ్గుల రామస్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు