మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని రాచాలపల్లి పరిధిలోని కాల్య తండాకు చెందిన పాత్లవత్ బదిలీ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపి నాయక్, నాయకులు మధురెడ్డి, శివారెడ్డి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.