మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండల కేంద్రానికి చెందిన పోలె భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ యువ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు MD. అరిఫ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు గుంజ ఆదినారాయణ, సీనియర్ నాయకులు దయాకర్, భాస్కర్, రఫీఖ్, రాజు, రాములు, వెంకటయ్య, అంజి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.