మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన కప్పేర ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మనోహర్ రెడ్డి, షైబాజ్, కప్పేర చంద్రయ్య, అశోక్, మ్యాకల శ్రీనివాసులు, శ్రీశైలం, మన్సూర్, షాకేర్, సహదేవ్, మాసుం, ఎల్లప్ప, కృష్ణ తదితరులు పాల్గొన్నారు