విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం.

24 కోట్ల రూపాయలతో JNTU నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం

వనపర్తి పట్టణ శివారులోని JNTU ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి విద్యార్థులు కళాశాలలో ఏర్పాటు చేసుకున్న విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కళాశాల ప్రిన్సిపల్ గారితో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ వనపర్తి లోని JNTU ఇంజనీరింగ్ కళాశాలకు త్వరలోనే నూతన భవనాల నిర్మాణాలను ప్రారంభిస్తామని, ప్రభుత్వం ఇట్టి నిర్మాణాలకు 24 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది.

వనపర్తి లోని జేఎన్టీయూ కాలేజీలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తాను ఎల్లవేళలా సహకరిస్తారని. విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.

విద్యార్థులు కళాశాలకు వచ్చిపోయేందుకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందువుతోందని తన దృష్టికి వచ్చిన వెంటనే ఆర్టిసి డిపో మేనేజర్ తో మాట్లాడి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయించాలని వారికి సూచించడం జరిగిది.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యశీల రెడ్డి శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.